Friday, March 29, 2024

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కోచింగ్ సెంటర్‌ కుప్పకూలి ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని భజన్‌పుర ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు విద్యార్థులతో సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. నలుగురు విద్యార్థులు 10 నుంచి 15 ఏళ్ల లోపు వారే. మృతుల్లో ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు. రెండు, మూడు అంతస్తులు నిర్మాణంలో ఉన్న ఈ భవనంలో కోచింగ్ సెంటర్‌గా నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 13 మందిని ఆస్పత్రికి తరలించారు. మరో 15మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Five Dead After Coaching Center Collapse at Delhi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News