Friday, March 29, 2024

తమిళనాడు బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు

- Advertisement -
- Advertisement -
Five death in fireworks shop accident at in Tamil Nadu
ఐదుగురు సజీవ దహనం.. పలువురు కార్మికులకు గాయాలు

చెన్నై: తమిళనాడులోని కళ్లకురుచి జిల్లా శంకరాపురంపట్టణంలోని బాణాసంచా కర్మాగారంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారని జిల్లా కలెక్టర్ పిఎన్ శ్రీధర్ తెలిపారు. మరో 11 మంది కార్మికులు గాయపడ్డారని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇరుకైన వీధిలో ఉన్న కర్మాగారంనుంచిపెద్ద ఎత్తున మంటలు, పొగ ఆకాశంలోకి ఎగసిపడుతుండగా జనం భయంతో హాహాకారాలు చేస్తూ పరుగులు పెడుతున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News