Friday, April 19, 2024

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Five killed in separate road accidents

హైదరాబాద్: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దివిస్ ల్యాబ్ సమీపంలో బైకు-కారు ఢీకొని ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆ ఘటన స్థలంలోనే బైకు-లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్రగాయాలై చనిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ధర్మోజీగూడెం వద్ద కారు-ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు ప్రాణాలు కొల్పోయారు. మృతులను హైదరాబాద్ కు చెందిన భజరంగ్ దళ్ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News