Saturday, April 20, 2024

నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద మలుపు వద్ద కారు అదుపు తప్పి కృష్టా వాటర్ పైప్ లైన్ ను ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. కారు హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారులో నుంచి మృతదేహాలను పోలీసులు బయటకు తీసి దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News