Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదం…. ఐదుగురు సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

Five members dead in Car accident in punjab

చండీగఢ్: పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగ్రూర్-సునమ్ రహదారిపై ట్రక్కును కారు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు. దిర్బా పట్టణంలో పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డీజిల్ ట్యాంక్‌కు కారు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని ఎస్‌పి వివేక్ షీల్ సోని పేర్కొన్నారు. మృతులలో వైద్యుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం సంగ్రూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News