Friday, March 29, 2024

లారీని ఢీకొట్టిన కారు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five Members dead in Lorry Accident

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి లారీ వెనక భాగంలో ఢీకొట్టడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పల్నాడు చెందిన ఓ కుటుంబం మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు వెల్దుర్తి మండలం సింగిరిపాడు గ్రామానికి చెందిన నాగిరెడ్డి(24), అనిమిరెడ్డి(60), గురువమ్మ(60),  అనంతమ్మ(55), ఆది లక్ష్మి(58)గా గుర్తించారు. మృతదేహాలను ప్రకాశం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News