- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్ ను గురువారం ప్రారంభించింది. ఈ సేల్ నవంబర్ 4 తేదీవరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుందని దిగ్గజ సంస్థ వెల్లడించింది. మోటోరోలా, పొకో, రియల్ మీ వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కాంట్ లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అదనపు డిస్కాంట్ సంస్థ అందిస్తుంది. ఈ సేల్ లో మరెన్నో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలకే అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునే వారికి ఇది మంచి సువర్ణావకాశం.
- Advertisement -