Thursday, April 25, 2024

భారీ వర్షాలు… బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తున్న మూసి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. బీబీనగర్ మండలం రుద్రవెళ్లి వద్ద లెవల్ బ్రడ్జి మీది నుంచి మూసి నది ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో బీబీనగర్-పోచంపల్లి, బోలేపల్లి-చౌటుప్పల్ మధ్య మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగెం బీమలింగం వద్ద బ్రిడ్జి పైనుంచి మూసి వరద ప్రవాహం ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుర్రపుడెక్క కొట్టుకొని వచ్చి బ్రిడ్జి పైన పేరుకపోవడంతో వాహనదారులు వెళ్తేందుకు రోడ్డు కనిపించడం లేదు. హైదరాబాద్‌లో గత రాత్రి భారీ వర్షం కురవడంతో మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.

Also Read: వర్షాకాలాన్ని తలపిస్తున్న వాతావరణం.. మరో మూడు రోజులు వర్షాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News