Friday, April 26, 2024

కెసిఆర్ నిర్ణయంతో పాఠశాలల రూపురేఖలు మారాయి: సబితా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ మేడ్చల్ న్యూస్ : సామాజిక సేవలో ఎఫ్ఎంసి సంస్థ ముందుకు వచ్చి 80 లక్షల రూపాయల ఖర్చుతో తరగతి గదులు, ఇతర సదుపాయాలు కల్పించటంతో పాటు సంస్థ ఉద్యోగులు విద్యార్థులతో మమేకమవ్వటం గొప్ప విషయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎంసి టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదులు, ఆర్వో ప్లాంట్, ఫర్నిచర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ను మంత్రి మల్లారెడ్డి గారితో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. స్వచ్చందంగా పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావటం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో ప్రేరణగా నిలుస్తాయని, చదివిన బడి రుణం తీర్చుకోవాలని, సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారు పేద పిల్లలు చదివే పాఠశాలలను దత్తత తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 7300 కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 12 విభాగాల్లో అభివృద్ధి పనులు చేపడుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న గురుకులాలకు డిమాండ్ బాగా పెరిగిందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అన్ని పాఠశాలల్లో ఈ విధంగా సీట్ల కోసం పోటీ ఏర్పడుతుందని, గురుకులాల్లో 1150 జూనియర్ కళాశాలలు, 80 డిగ్రీ కళాశాలలు, పీజీ, లా కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. విదేశి విద్యకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు అందిస్తున్నామని, ఇప్పటికే 5 వేల మంది విదేశి విద్యా అభ్యసిస్తున్నారని సబితా ప్రశంసించారు. చాలా మంది తల్లిదండ్రులు కేవలం ఇంగ్లీష్ మీడియం కోసమే ప్రైవేటుకు వెళ్తుండటంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తుత విద్యా సంవత్సరం 1 నుంచి 8 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభిస్తారని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News