Tuesday, April 23, 2024

తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

- Advertisement -
- Advertisement -

Food processing units across Telangana

గుజరాత్ తర్వాత వేరుశెనగకు తెలంగాణ ప్రసిద్ధి
ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశెనగ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తోందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్‌లోని సబర్ కాంఠ జిల్లా ఓరన్‌లోని దేవస్య న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్ వేరుశెనగ ఆధారిత పీనట్ బట్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుజరాత్ తర్వాత వేరుశెనగకు తెలంగాణ ప్రసిద్ధి అని ఆయన తెలిపారు. తెలంగాణలో వేరుశెనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో గుజరాత్‌లోని పరిశ్రమలను పరిశీలించడం జరుగుతుందన్నారు.

తెలంగాణలో ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశెనగ ఉత్పత్తి అవుతుందని ఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మేరకు జిల్లాల వారీ పంటల ఆధారంగా యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతు పండించిన పంటలకు లాభసాటి ధర అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంప్రదాయ పంటల సాగు నుంచి రైతాంగం బయటకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో అగ్రి ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News