- Advertisement -
విజయనగరం: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు (89) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాంబశివరాజు సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు రాజకీయంగా ఎదిగారు. 8సార్లు ఎంఎల్ఎ, ఒకసారి మంత్రి, ఏఐసిసి కార్యదర్శిగా సాంబశివరాజు పనిచేశారు. శాసనసభలో రెండుసార్లు ప్రొటెమ్ స్వీకర్ గా బాధ్యతలు చేపట్టారు. గజపతినగరం, సతివాడ స్థానాల నుంచి వరసగా 8 సార్లు ఎంఎల్ఎగా ఎన్నికైయ్యారు. 1968లో తొలిసారి ఎంఎల్ఎగా గెలిచారు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రాజకీయ కురువృద్ధుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, అందులోనే కొనసాగారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
- Advertisement -