Thursday, April 18, 2024

మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి ఇకలేరు…

- Advertisement -
- Advertisement -

Former MLA Kethiri Sai Reddy passes away

క‌రీంన‌గ‌ర్: హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి శుక్ర‌వారం ఉద‌యం 4 గంట‌ల‌కు కన్నుమూశారు. సాయిరెడ్డికి గుండెపోటు రావ‌డంతో కుటుంబ సభ్యులు హైద‌రాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండ‌లం జూపాక‌లో జన్మించారు. సాయిరెడ్డి గతంలో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జ‌డ్పీ చైర్మ‌న్‌తో పాటు 1983, 1989లో ఆయ‌న స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేసి ఎంఎల్ఎగా గెలుపొందారు.  సాయిరెడ్డి మృతిప‌ట్ల ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ సంభ్యుల‌కు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News