- Advertisement -
అమరావతి: ఆంధప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు వైటి రాజాకు కరోనా వైరస్ సోకి ఆదివారం ఉదయం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ రాజా చనిపోయారు. 1999 శాసన సభ ఎన్నికల్లో టిడిపి తరఫున తణుకు నుంచి గెలుపొందారు. ఆయన మృతిపట్ల టిడిపి నేతలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వైటి రాజా సోదరిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు ఇచ్చి వివాహం చేశారు.
- Advertisement -