Thursday, April 25, 2024

ఎయిమ్స్‌లో చేరిన మన్మోహన్‌సింగ్

- Advertisement -
- Advertisement -
Former PM Manmohan Singh admitted to AIIMS
మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉన్నదన్న కాంగ్రెస్‌వర్గాలు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్(89)ని బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. రెండు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయణ్ని ఎయిమ్స్‌లో చేర్చినట్టు కాంగ్రెస్‌పార్టీ అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ఎఐసిసి కార్యదర్శి ప్రణవ్‌ఝా ట్విట్ చేశారు. ఎయిమ్స్‌లో కార్డియాలజీ ప్రొఫెసర్ నితీశ్‌నాయక్ పర్యవేక్షణలో మన్మోహన్‌ను ఉంచినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా పాజిటివ్ రావడంతో మన్మోహన్‌సింగ్‌ను ఎయిమ్స్‌లో చేర్చి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత ఆయణ్ని డిశ్చార్జ్ చేశారు. 2009లో మన్మోహన్‌సింగ్‌కు బైపాస్ సర్జరీ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News