- Advertisement -
లఖ్నో: ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ను సోమవారం లఖ్నో పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నగరంలో ధర్నాకు దిగిన అఖిలేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్లో తరలించారు. రైతుల ఆందోళనకు మద్దతుగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కిసాన్ యాత్ర చేపట్టాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. దాంతో, ఆయన నివాసం, పార్టీ ఆఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకొని పార్టీ ఆఫీస్ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో, కార్యకర్తలతో కలిసి రోడ్డుపైనే అఖిలేశ్ బైఠాయించగా, అరెస్ట్ చేశారు.
- Advertisement -