Wednesday, April 24, 2024

కారు డోర్ లాక్.. ఊపిరాడ‌క న‌లుగురు చిన్నారుల మృతి

- Advertisement -
- Advertisement -

Four children died of suffocation in car

ఉత్తరప్రదేశ్: చండీనగర్ ప్రాంతంలోని సింగౌలి టాగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటున్న సమయంలో కారులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు శుక్రవారం ఊపిరాడక మరణించారు. మ‌రొక చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఓ ఇంటి ముందు పార్కు చేసిన కారులో ఐదుగురు చిన్నారులు ఆడుకుంటున్న స‌మ‌యంలో కారు లాక్ అయింది. దీంతో వారంతా అందులోనే ఉండ‌డంతో ఊపిరాడ‌లేదు. కారు లోపల చిక్కుకున్న పిల్లలను నియాతి (8), వందన (4), అక్షయ్ (4), కృష్ణ (7), శివన్ష్ (8) గా గుర్తించారు. శివన్ష్ మినహా మిగతా వారంతా అక్కడికక్కడే మరణించారు. సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం మార్చురీకి తరలించారు. మృతిచెందిన చిన్నారులు అంద‌రూ పదేళ్ల‌లోపు వారేనని పోలీసులు తెలిపారు.

Four children died of suffocation in car

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News