- Advertisement -
మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలం చీకటాయపాలెం వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్రలలోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో లారీలో 11మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతులతండా వాసులుగా గుర్తించారు. మృతులు హర్యా, గోవిందర్, మధు, ధూర్యాలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఏడుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -