Saturday, April 20, 2024

కామారెడ్డి జిల్లాలో విషాదం

- Advertisement -
- Advertisement -

four drowned in Kamareddy district

బీర్కుర్‌: కామారెడ్డి జిల్లాలోని బీర్కుర్‌ శనివారం విషాదం చోటుచేసుకుంది. నీటిలో మునిగి నలుగురు మృతిచెందారు. మరొకరు గల్లంతయ్యారు. నీటిలో మునిగిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని పోలీసులు వెల్లడించారు. మృతులను బిక్చుంద మండలం సెట్‌లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మంజీర పరీవాహక ప్రాంతంలోని చౌడమ్మ ఆలయానికి వెళ్లేందుకు నది దాటుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు జరపడంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కాలినడకన నది దాటుతుండగా గుంతల్లో పడి మునిగిపోయారు. స్థానికులు ముగ్గురి మృతదేహాలను వెలికితీసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉన్నాయి.

four drowned in Kamareddy district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News