Friday, April 19, 2024

‘వ్యాయా’మాయం

- Advertisement -
- Advertisement -

exercise

 ప్రతి ఐదుగురిలో వ్యాయామం చేసేవారు ఒక్కరే
బాలుర కంటే బాలికల్లో శారీరక శ్రమ చాలా తక్కువ
డబ్లూహెచ్‌ఒ ఆధ్వర్యంలోని ది లాన్సెట్ సర్వే నివేదిక వెల్లడి
కౌమార దశలోని పిల్లలకు శారీరక శ్రమపై అవగాహన జరపాలని సూచన

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలో ప్రతి ఐదుగురు టీనేజర్లలో నలుగురు సరైన వ్యాయామం చేయట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యం లోని ది లాన్సెట్ అనే సంస్థ వెల్లడించింది. 146 దేశాల్లో నిర్వ హించిన సర్వే నివేదికలో ఈ విషయాన్ని విశదీకరించింది. అన్ని దేశాలు కౌమార దశలోని పిల్లల శారీరక శ్రమపై తమ విధానాలను అభివృద్ధి చేయాలని, అందుకు అవసరమైన వనరులను కేటాయించాలని అని లాన్సెట్ నివేదిక కోరిం ది. ముఖ్యంగా 11 నుంచి 17 ఏళ్ల వయస్సు గల విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించగా, మన దేశంలో 72 శాతం మంది ఈ వయస్సు వారు వ్యాయామం చేయకపోవడంతో చురుగ్గా ఉండట్లేదని పేర్కొంది. దీంతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నట్లు వివరించింది.

బాలుర కంటే బాలికల్లో శారీరక శ్రమ ఇంకా తక్కువగా ఉంది. వారిని ఇంటికే పరిమితం చేయడం, బయటకు పంపడానికి అనువైన వాతావరణం లేకపోవడం వంటి కారణాలున్నాయని తెలిపింది. సాంస్కృతిక సంప్రదాయాలు, భద్రతా పరమైన అంశాలు బాలికలకు ప్రతికూలంగా మారుతున్నాయి. బాలికల శ్రమ విషయంలో మన దేశం సహా బంగ్లాదేశ్ అత్యంత వెనుకబడి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2001లో బాలురలో 80 శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటే, ఇప్పు డు 78 శాతానికి తగ్గింది. కానీ బాలికల్లో శారీరక శ్రమ కు దూరంగా ఉన్నవారు 85 శాతం మందే అప్పటిలాగే ఉండటం గమనార్హం. ఎముకలు, కండరాలు పటిష్టంగా ఉండాలంటే ఈ వయసులో కనీసం రోజుకు గంట పాటు కఠిన లేదా మితమైన వ్యాయామాలు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవచ్చని తెలిపింది. యువతకు ఆడుకునే హక్కు ఉందని, ఆ హక్కును కల్పించాలని ఈ సర్వే సూచించింది.

శారీరక శ్రమను పెంచడానికి అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం దేశంలో 10 నుంచి 19 ఏళ్ల మధ్య పిల్లల్లో 5 శాతం మంది బిపితో బాధపడుతుండగా, రాష్ట్రంలో అది ఏకంగా 6.7 శాతం ఉంది. అదే వయసు పిల్లల్లో మధుమేహంతో బాధపడేవారు దేశంలో 0.6 శాతం మంది ఉండగా, తెలంగాణలో 1.1 శాతం మంది ఉన్నారు. ఆ వయసు పిల్లల్లో దేశంలో మన రాష్ట్రం బిపి విషయంలో 5వ స్థానం, మధుమేహంలో 9వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 8.6 శాతం మంది ప్రీ డయాబెటిక్‌తో బాధపడుతున్నారని తేల్చింది.

ఎలక్ట్రానిక్ పరికరాలపైనే మక్కువ

డిజిటల్ టెక్నాలజీ కారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలపై టీనేజర్లు ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 5 వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిల్లో 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 95 శాతం స్కూళ్లలో ఆట స్థలాలున్నాయి. అయితే రాష్ర్టంలో 10,549 ప్రైవేటు స్కూళ్లు ఉండగా, వాటిల్లో 31.21 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. 8,044 ప్రైవేటు స్కూళ్లలో మైదానాలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నా, 50 శాతం పైగా ప్రైవేటు స్కూళ్లల్లో ఆట స్థలాలు లేవని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 ఉండగా, 1,500 ప్రైవేట్ జూనియర్ కాలేజీలున్నాయి. 80 శాతం ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో మైదానాల్లేవు . దీంతో విద్యార్థులు ఆటలు ఆడటం కష్టమవుతోంది. ఫలితంగా పిల్లలపై జీవనశైలి వ్యాధులు దాడి చేస్తున్నాయి.

Four in five teenagers not doing enough exercise

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News