Friday, March 29, 2024

రోడ్డు ప్రమాదంలో న‌లుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four killed in road accident At Firozabad

ఫిరోజాబాద్‌: ఆటో-లారీ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో న‌లుగురు మృతి చెందిన సంఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌-ఫ‌రీహా ర‌హదారిపై ఆటో-లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు మ‌హిళ‌లు, ఒక చిన్నారి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా… మ‌రో వ్య‌క్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. న‌ర్ఖి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఈ ప్ర‌మాదం జరిగింది. స్థానికుల స‌మాచారంతో ఘటనాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆటోలోని మృత‌దేహాల‌ను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని పరారీలో ఉన్న లారీ డ్రైవ‌ర్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Four killed in road accident At Firozabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News