Tuesday, April 23, 2024

కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…… నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

జాతీయ రహదారి 163పై రెండు కార్లు ఢీ
నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

Four members dead in Car accident

మనతెలంగాణ/కొడంగల్/కొడంగల్‌రూరల్‌: వికారాబాద్ జిల్లా కొడంగల్-బీజాపూర్ జాతీయ రహదారి 163పై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఈ సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొడంగల్ సీఐ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం…. హైద్రాబాద్‌లోని యూసుఫ్‌గూడకు చెందిన మౌలానా బీ(58) కాలు విరిగిపోవడంతో వైద్యం కోసం తన కూమారులు బాబు మీయా(39), మహమ్మద్ అబ్దుల్( 35)లతో పాటు మనవడు మహమ్మద్ రషీద్(27)లతో కలసి ఏపి12జి7786 నెంబరు గల ఇన్నోవా కారులో కర్నాటక రాష్ట్రం యాద్గీర్‌కు బయలుదేరారు. కొడంగల్ శివారులోని రాఘవేంద్ర ఆసుపత్రి వద్దకు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైరు పేలింది. అతివేగంతో పాటు కారు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా కర్నాటక రాష్ట్రం యాద్గీర్ నుంచి హైద్రాబాద్ వెళ్తున్న కెఎ32పి6777 నెంబరు గల కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న మౌలానా బీ, బాబు మీయా, మహమ్మద్ అబ్దుల్, మహమ్మద్ రషీద్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని స్ధానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు సిఐ తెలిపారు. కాగా రెండు కార్లు అతీవేగంగా ఢీకొనడంతో పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. కార్లలోనే ఇరుకున్న మృతదేహాలు, గాయపడిన వారిని వెలికితీసేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News