Saturday, April 20, 2024

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన సంఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం మోహన్‌రావు పేట వద్ద సోమవారం తెల్లవారుజామున  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్లాపూర్ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మల్లాపూర్ వాసులు రమాదేవి, లత, చిన్నారులు శిరీష్, చరణ్‌గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News