- Advertisement -
యాదాద్రి: భువనగిరి మండలం ముత్తిరెడిగూడెంలో విష ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో వండిన అన్నంలో గొర్రెల మందును గుర్తు తెలియని వ్యక్తులు కలపారు. విషపూరిత ఆహారాన్ని తినడంతో వాంతులు, విరేచనాలు కావడంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గ్రామస్థులు వారిని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఇంతవరకు బాధితులు ఫోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
- Advertisement -