- Advertisement -
పిఎపల్లి: నల్లగొండ జిల్లా పిఎపల్లి మండలం దుగ్యాల గ్రామ వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. కారు అదుపుతప్పి ఎఎంఆర్పి కాలువలోకి కారు దూసుకెళ్లడంతో నలుగురు గల్లంతయ్యారు. స్థానికులు కారులో ఉన్న బాలుడిని రక్షించారు. మరో ముగ్గురు కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారు ముందు టైరు పేలడంతో కాలువలోకి దూసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. మృతులు పిఎపల్లి మండలం వడ్డెరిగూడెం వాసులుగా గుర్తించారు.
Four missing in Car plung into Canal in Nalgonda
Locals rescued the boy in the car. The villagers had to carry out the evacuation for three more. According to locals, the police have taken steps to reach the spot. The details are yet to be known.
- Advertisement -