Thursday, April 25, 2024

హరితహారం చెట్లు ధ్వంసం కేసులో నలుగురి నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

harithaharam

 

హైదరాబాద్ : హరితహారంలో భాగంగా నాటిన చెట్లను ధ్వంసం చేసిన కేసులో నలుగురు నిందితులను సిద్ధిపేట టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. మార్చి 3వ తేదీన సిద్దిపేట కొత్తబస్టాండ్ దగ్గర కొండ భూదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా గల 11 చెట్లను నరికి ధ్వంసం చేశారు. ఘటనకు సంబంధించి సిద్ధిపేట మునిసిపాలిటీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి సిద్ధిపేట టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన టూటౌన్ ఇన్‌స్పెక్టర్ కె.పరశురామ్ సిద్ధిపేట పట్టణంలో సిసి కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసును ఛేదించి నిందితులను గుర్తించారు. నిందితుల్లో కూకట్‌పల్లి హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కొర్రి జయభరత్‌రెడ్డి(47) జనగామ జిల్లాకు చెందిన భుక్యా రవీందర్(32). కుంసోత్ శేఖర్(23), భుక్యా సంథీప్(20)లు ఉన్నారు. ఈ కేసులో చురుకుగా పనిచేసి నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని సిద్ధిపేట ఏసిపి అభినందించారు.

 

Four persons arrested for destroying Trees
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News