Tuesday, March 19, 2024

మంచిర్యాల జిల్లాలో కుటుంబం ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Four suicides from the same family in mancherial

కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు ప్రాణాలు తీసుకున్నారు. ఉరేసుకుని దంపతులు రమేశ్, పద్మ బలవన్మరణానికి పాల్పడ్డారు. గదిలో కుమారుడు, కుమారై మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో కుమారుడు అక్షయ్(17), కుమారై సౌమ్య(19)గా గుర్తించారు. ఇటీవలే కుమారై అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Four suicides from the same family in mancherial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News