Friday, April 26, 2024

వేడి నీళ్లలో పడి బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

జనగాం: వేడి నీళ్లలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన జనగాం జిల్లా రఘునాథపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బుద్ధాతండాలో రమేష్-అరుణ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. స్నానం చేయించాలని నీటి బకెట్‌లో హీటర్ పెట్టింది. పెద్ద కుమారుడు ఆకలి అవుతుందని అన్నం పెట్టాలని కోరడంతో హీటర్ తీసేసి భోజనం పెట్టడానికి వెళ్లింది. కానీ చిన్న కుమారుడు గీతమ్ రామ్ (4) ఆడుకుంటూ వెళ్లి నీళ్లలో పడి పోయాడు. కేకలు వేయడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రిలో తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడడు చనిపోయాడు. బాలుడి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News