Thursday, March 28, 2024

అన్నపూర్ణ క్యాంటిన్లలో ఉచిత భోజనం

- Advertisement -
- Advertisement -

 Annapurna canteen

 

హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో పేదప్రజలకు, ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులకు, ఒంటరి వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటిన్లను పునరుద్ధరించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో 150 సెంటర్లలో ఉచిత భోజనం శనివారం నుంచి ప్రారంభించినట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖమంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. అన్నపూర్ణ క్యాంటిన్ల ద్వారా మధ్యాహ్న భోజనంతో పాటు అవసరమైన చోట రాత్రి పూట భోజనం కూడా అందుబాటులో ఉంటుందని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. పారిశ్రామిక వాడలు, మురికి వాడలు, హాస్టళ్లు, పేదప్రజలు నివసించే కాలనీల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Free lunch in Annapurna canteen
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News