Friday, April 19, 2024

ఇక వందేభారత్ సరకు రవాణా రైళ్లు

- Advertisement -
- Advertisement -

Freight version of Vande Bharat trains soon

న్యూఢిల్లీ : దేశంలో మూడు వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను ఇటీవల ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే . నాలుగో రైలును గురువారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని అందౌరా రైల్వే స్టేషన్ మధ్య నడిచే ఈ రైలును ఉనా జిల్లాలో గురువారం ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు తో ఢిల్లీ చండీగఢ్ మధ్య ప్రయాణ సమయం 3 గంటల కంటే తక్కువే ఉండనుంది. అయితే త్వరలోనే సరకు రవాణాకు కూడా వందే భారత్ తరహా రైళ్లను తీసుకురావాలని రైల్వేశాఖ యోచిస్తోంది. తక్కువ సమయంలో సరకు రవాణా చేసేందుకు గాను ఈ హైస్పీడ్ పార్మిల్ రైలు సేవలను మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News