Thursday, April 25, 2024

స్నేహితుడిని దావత్‌కు పిలిచి… మొండెం, తలను వేరు చేసి

- Advertisement -
- Advertisement -

Friend murder in rangareddy

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డులోని బొంగుళూరు ప్రాంతంలో దావత్‌కు స్నేహితుడిని పిలిచి దారుణంగా హత్య చేసి మొండెం, తలను వేరు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నామ శ్రీనివాస్ అనే వ్యక్తి భార్య చనిపోవడంతో బొంగుళూరు ప్రాంతం మెట్రో సిటీ కాలనీలో నివసిస్తున్నాడు. నామ శ్రీనివాస్‌కు బ్రహ్మచారి, డ్యాన్సర్ నరేష్, ట్రాన్స్‌జెండర్ రాజమ్మ స్నేహితులుగా ఉన్నారు. డిసెంబర్ 14న నామ శ్రీనివాస్ కనిపించడం లేదని ఆయన తండ్రి రామస్వామి, కుమారుడు గోపీ కృష్ణ ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే రోజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రహ్మచారి అనే వ్యక్తి చీటింగ్ కేసులో పిఎస్‌లో లొంగిపోయాడు. దీంతో బ్రహ్మచారిని విచారిస్తుండగా ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఎల్ బి నగర్ పిఎస్ పరిధిలో ఓ కేసులో బ్రహ్మచారి అరెస్టై జైలులో ఉన్నాడు. తన కోసం బెయిల్ తీసుకోవాలని శ్రీనివాస్‌ను బ్రహ్మచారి కోరాడు. డబ్బులో తీసుకొని బెయిల్ ఇప్పించాలని బతిమాలాడు.

శ్రీనివాస్ పట్టించుకోకవడంతో సంవత్సరం జైలు జీవితం గడిపి బ్రహ్మచారి బయటకొచ్చాడు. అప్పటి నుంచి శ్రీనివాస్‌పై బ్రహ్మచారి పగపెంచుకున్నాడు. తన స్నేహితుడు రాజమ్మ, నరేష్ సహాయంతో దావత్ చేసుకుందామని శ్రీనివాస్‌కు బ్రహ్మచారి కబురుపంపాడు. నలుగురు కలిసి బొంగుళూరు అటవీ ప్రాంతానికి వెళ్లారు. శ్రీనివాస్‌కు మద్యం పూటుగా తాగించి ఉరేసి చంపేశారు.

అనంతరం మొండెం తల వేరు చేశారు. అక్కడే మొండాన్ని పాతిపెట్టారు. తల ఎక్కడ దాచి పెట్టారనేది తెలియలేదు. ప్రస్తుతం రాజమ్మ, నరేష్ పరారీలో ఉన్నారు. వారు పట్టుబడితే నిజాలు వెలుగులోకి వస్తాయి. గతంలో శ్రీనివాస్ ఓ పోలీస్ అధికారికి ఇన్‌ఫార్మర్‌గా పని చేశాడని శ్రీనివాస్ తండ్రి, కుమారుడు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీనివాస్ హత్య వెనుక పోలీస్ అధికారి హస్తం ఉండొచ్చని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. భూవివాదాలు, ఇతర సెటిల్‌మెంట్లలో సదరు పోలీస్ అధికారికి శ్రీనివాస్ సహకరించేవాడని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News