మన తెలంగాణ/మోత్కూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు లాక్ డౌన్ విదించడంతో గురువారం మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలోని ప్రజలకు స్థానిక ఎంపిటిసి రచ్చ కల్పన లక్ష్మీనర్సింహ్మారెడ్డి , పారిశ్రామిక వేత్త రచ్చ లక్ష్మీనర్సింహ్మారెడ్డిలు పండ్లు, కూరగాయలను పంపిణీ చేశారు. ప్రజలు లాక్ డౌన్కు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండెబోయిన మల్లేష్, నాయకులు గనగాని యాదగిరి, భూపతి శ్రీను, గనగాని రాజేష్, సూర్యప్రకాష్, ఉపేందర్రెడ్డి, మడూరు రాజు తదితరులు పాల్గొన్నారు. పాటిమట్ల గ్రామంలోని 8వవార్డులో బిజెపి మండలఅ ద్యక్షుడు సోలిపురం లక్ష్మీనర్సింహ్మారెడ్డి, స్థానిక వార్డు సభ్యురాలు బండ పద్మజ నర్సిరెడ్డిలు 100మందికి కూరగాయలను పంపిణీ చేశారు. ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావద్దని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.