Saturday, April 20, 2024

కరోనా చికిత్స కోసం కెసిఆర్ రూ.100 కోట్లు మంజూరు…

- Advertisement -
- Advertisement -

Funds released corona treatment by KCR Govt

హైదరాబాద్: కరోనా చికిత్స కోసం సిఎం కెసిఆర్ 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా విధుల్లో చాలా విభాగాలు నిమగ్నమై ఉన్నాయని తెలిపింది. వైద్యులు, సహాయ సిబ్బంది నియామకానికి కూడా సిఎం అనుమతులు ఇచ్చారని, అన్ని రాష్ట్రాలతో పోలీస్తే తెలంగాణ కరోనా మరణాలు 0.88 శాతం మాత్రమే ఉందని, 70 శాతం మంది హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారని వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని, మాస్క్ ధరించడం, భౌతిక దూరం, చేతుల శుభ్రతతో కరోనాను ఎదర్కోవచ్చని పేర్కొంది. సీజనల్‌గా వచ్చు వ్యాధులను చూసి కరోనా అని భయపడొద్దని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News