Thursday, April 18, 2024

జి-20 సమావేశాల భద్రతపై సమీక్ష..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లో జనవరి 28 నుండి జూన్ 17 వ తేదీ మధ్యలో జరుగనున్న అత్యంత ప్రతిష్టాత్మక జి-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని జి-20 సెక్యూరిటీ కోఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించారు. డిజిపి అంజనీ కుమార్ అధ్యక్షతన మంగళవారం ఉదయం డిజిపి కార్యాలయంలో జి-20 సెక్యూరిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారులతోపాటు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, రీజినల్ పాస్‌పోర్టు ఆఫీస్, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.ఆర్.డి.ఎఫ్, సి.ఐ.ఎస్.ఎఫ్, ఎన్.ఎస్.జి తదితర భద్రతా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సంద ర్బంగా డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలో మూడింటా రెండవ వంతు జనాభాను కవర్ చేయడంతో పాటు, ప్రపంచంలోని 85 శాతం జిడిపి, 75 శాతం గ్లోబల్ వాణిజ్యాన్ని శాసించే 29 దేశాలు సభ్యులుగా ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక జి-20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశం దేశ ప్రధాని నేతృత్వంలో సెప్టెంబర్ మాసంలో జరుగనుందని తెలిపారు. ఈ అత్యున్నత సమావేశానికి ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూపు సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో ఆరు సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. జనవరి 28 న తొలి సమావేశం జరగనుండగా, మార్చ్ 6 , 7 తేదీలలో, ఏప్రిల్ 26 ,27 ,28 తేదీలలో, జూన్ 7 ,8 ,9 తేదీలు, జూన్ 15 , 16 ,17 తేదీలు, జూన్ 17 తేదీల్లో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు.

ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు,జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారులనుండి స్వచ్చంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశాలు సజావుగా, ఏ విధమైన భద్రతాపరమైన అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వ యం అవసరమన్నారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ఉన్నత స్థాయి ప్రతినిధులు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశమున్నందున ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో సమర్ధవంతమైన సమన్వయం కోసమై అంతర్గత వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని తెలిపారు.

ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రతీ ఒక్కరి యాంటిడేన్స్‌లను పక్కాగా పరిశీలించాలని కోరారు. ప్రధానంగా ఎయిర్‌పోర్టు, ప్రతినిధులు బస చేసే హోటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. ఎయిర్‌పోర్టుతో పాటు నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డిజిలు అభిలాష బిస్త్, సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, విజయ కుమార్, నాగిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ అడిషనల్ సిపి విక్రమ్‌సింగ్ మాన్, డిఐజి తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ అడిషనల్ సిపి సుధీర్ బాబు, హోంమంత్రిత్వ శాఖ ఎస్.ఐ.బి డిడి సంబల్ దేవ్,

రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు సి.ఎస్.ఓ భారత్ కందార్, డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ ఇందుభూషణ్ లెంక, ఎన్.డి.ఆర్.ఎఫ్. దామోదర్ సింగ్, సి.ఐ.ఎస్.ఎఫ్‌కు చెందిన సింగన రామ్, ఎన్.ఎస్.జి కి చెందిన కల్నల్ అలోక్ బిస్త్, జిఎడి ప్రోటోకాల్ అధికారి కె.నాగయ్య తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News