- Advertisement -
ధరూర్: జోగులంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. మర్లబీడు గ్రామంలో రేణుక (25) అనే వివాహిత భర్తతో కలిసి ఉంటుంది. కొన్ని రోజుల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో రేణుక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో బ్రతికి ఉండగానే ఆసుపత్రికి తరలించకుండా సెల్ ఫోన్స్ లో రికార్డు చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -