Friday, April 19, 2024

గాంధీ దవాఖాన వైద్యుడు ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

Meerpet police have arrested a fake doctor

 

 

ఆదిలాబాద్: గాంధీ దవాఖానలో పని చేసే వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆదిలాబాద్ లోని టీచర్స్ కాలనీలో సూర్యనారయణ, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శశాంక్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు రావుల శరణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మెడిసిన్ లో 144వ ర్యాంక్ వచ్చింది. మంగళవారం రాత్రి శరణ్ తన క్వార్టర్స్ లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే.. ఎంతకు లిఫ్ట్ చేయకపోవడంతో తన మేనమామ అతడి రూమ్ కి వెళ్లి చూడగా ఉరేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆదిలాబాద్ లో బుధవారం సాయంత్రం అంత్యక్రియలు చేశారు. మమ్మీ, డాడీ తనని క్షమించాలని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. కుమారుడు మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News