Friday, March 29, 2024

బేగంపేటలో మెడికో‌ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

gandhi medical student commits suicide in hyderabad

సికింద్రాబాద్: హైదరాబాద్‌లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకుంది. గాంధీ ఆస్పత్రిలో పిజి మొదటి సంవత్సరం చదువుతున్న ఝాన్సీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బేగంపేటలోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మానసిక ఒత్తిడి వల్లే యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం మెదక్ జిల్లా నర్సాపూర్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News