పాట్నా: 16 ఏళ్ల బాలికకు లిఫ్ట్ ఇచ్చి ఆమెపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన బిహార్లోని సుపౌల్ జిల్లాలో జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సహార్సాలో తన బాయ్ ఫ్రెండ్ను కలిసిన అనంతరం ఆమె ఇంటికి వెళ్తుండగా ఒక యువకుడు లిఫ్ట్ ఇచ్చాడు. గమ్హారియా గ్రామ శివారులో బైక్ ఆపి ఆమెపై లిఫ్ట్ ఇచ్చిన యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరు స్నేహితులు వచ్చి ఆమెపై అత్యాచారం చేయడంతో ఎక్కువగా బ్లీడింగ్ కావడంతో వాళ్ల నుంచి తప్పించుకొని గ్రామ పోలీస్ను కలిసింది. వెంటనే అతడు స్థానిక ఆస్పత్రికి తరలించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీస్ అధికారిణి ప్రేమలతా భుపాశ్రీ తెలిపింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజిపూర్ జిల్లాలోని కశిమాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటి పక్కన ఉండే యువకులు 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.