Friday, April 19, 2024

రౌడీ షీటర్ రాజు థేట్ కాల్చివేత

- Advertisement -
- Advertisement -

జైపూర్: కరడుగట్టిన రౌడీ షీటర్  రాజు థేట్ ను  శనివారంనాడు సికార్ జిల్లాల్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తుల కాల్చి చంపారు. ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రాలి రోడ్డులో ఉన్న అతని ఇంటి మెయిన్ గేట్ వద్ద ఈ ఘటన చేటుచేసుకుందని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు మూడుసార్లు థేట్‌పై కాల్పులు జరిపినట్టు ఎస్‌పీ కున్వర్ రాష్ట్రదీప్ తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, హర్యానా, జుంజును సరిహద్దులను మూసేశామని పోలీసులు చెప్పారు.

కాగా, థేట్‌ను కాల్చిచంపినది తామేనని గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ప్రకటించాడు. గ్యాంగ్ సభ్యులు ఆనంద్‌పాల్, బల్బీర్ బనుడను చంపినందుకు ప్రతీకారంగా ఈ హత్య చేశామని చెప్పారు. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్‌‌ సభ్యుడిగా గోదారా ఉన్నాడు. ఆనందపాల్ గ్యాంగ్‌ సభ్యుడైన గ్యాంగ్‌స్టర్ బనడును 2014 జూలైలో బికనెర్ జైలులో మట్టుబెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News