Saturday, April 20, 2024

సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, విద్యాలయాల్లో మెస్ చార్జీలపై మంత్రుల చర్చ..

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, విద్యాలయాల్లో మెస్ చార్జీలపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ లు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పెరుగుతున్న ద్రవ్యోల్భణానికి అనుగుణంగా విధ్యార్థులకు మరింత మెరుగైన పౌష్టికాహారం అందించడానికి సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం అసెంబ్లీ కమిటీ హాళ్లో మంత్రులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో మెస్ చార్జీల పెంపుపై, విధ్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించాలని శాఖా పరంగా ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలపై చర్చించారు.

సంక్షేమ శాఖల బడ్జెట్లో మెస్ చార్జీల కేటాయింపులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. అనంతరం ముగ్గురు మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కలిసి వివరించారు. సావదానంగా విన్న ఆర్థిక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు.

కాగా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్లో బిసి సంక్షేమ శాఖకు రూ.6229 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.3117 కోట్లు కేటాయించి, గతం కన్నా నిధులను పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రికి, మంత్రి హరీష్ రావుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి గంగుల కమలాకర్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News