Saturday, April 20, 2024

రాజ్యాంగంలోని చట్టాలే ప్రజలకు రక్షణ మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: ప్రపంచంలో భారత రాజ్యాంగం గొప్పదని రాజ్యాంగ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పార్టీ పాలనతో భారత రాజ్యాంగ వ్యవస్థకు పెను ప్రమాదం వాటిల్లుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం 73వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోర్టు సర్కిల్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి బీజేపీ 25 రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలను కూల్చివేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. బీజేపీని ప్రజలు గద్దెదించకపోతే ఉత్తరాదిన పరిస్థితులు తెలంగాణలోను పునరావృతమైందని అన్నారు.

అందరు కలిసికట్టుగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వివిధ దేశాల రాజ్యాంగాలను క్రోడికరించి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం తీసుకుని రచించారన్నారు. రాజ్యాంగాన్ని పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి కొన్ని మార్పులు చేర్పులు చేరుస్తూ 1949 నవంబర్‌లో ఆమోదం పొందిందని తెలిపారు. అప్పటి నుంచి దేశంలో సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకికవాద ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అయ్యిందని తెలిపారు. ఈ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి రావడం జరిగిందన్నారు. రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం అందరికి సమాన హక్కులు, విధులు, ఆదేశ సూత్రాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్‌రావు, చల్లా హరిశంకర్, మేడి మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News