- Advertisement -
తాటిచెట్టుపై గీత కార్మికుని మృతి
మన తెలంగాణ/భూదాన్పోచంపలి: నల్లగొండ జిల్లా మున్సిపల్ పరిధిలోని ముక్తాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెట్టుపై గీతా కార్మికుడు మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… గుండ్ల సత్తయ్యగౌడ్(55) బుధవారం సాయంత్రం తాటి చెట్టు నుండి కల్లును సేకరించేందుకు చెట్టును ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలు జారడంతో తాటిచెట్టుపైనే మృతి చెంది వేలాడబడ్డాడు. ఇది గమనించిన గ్రామస్తులు నిచ్చెన సహాయంతో ఎంతో కష్టంతో మృతదేహాన్ని తాటి చెట్టు పైనుంచి కిందకు దించారు. తాము చూస్తుండగానే తాటి చెట్టు పై ప్రమాదం జరిగిందని సత్తయ్యగౌడ్ విలవిలలాడుతూ అరిచినా తాము ఎలాంటి సహాయం చేయలేకపోయామని మాజీసర్పంచ్ మునుకుంట్ల బాలచంద్రం, తోటి గీత కార్మికులు తీవ్ర మనస్తాపాని గురై మృతి చెందారు.
- Advertisement -