Wednesday, April 24, 2024

టిఆర్ఎస్ ఎంఎల్ఎ ముఠా గోపాల్‌కు జరిమానా..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:జిహెచ్‌ఎంసి విజిలెన్స్, ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు రూ.5వేల జరిమానాను విధించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం పురస్కరించుకుని నగరంలోని విఎస్‌టి-ఆర్టీసీ కళ్యాణ మండపం రోడ్డులో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులతో తన పోటోతో కూడిన భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. దీంతో ఓ వ్యక్తి ఈ కటౌట్‌ను ఫోటో తీసి సీఈసి ఈవిడిఎం ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో నిబంధనలకు విరుద్దంగా ఈ కటౌట్ ఏర్పాటు చేసినట్లుగా గుర్తించిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు రూ.5వేల జరిమానా విధిస్తూ ఆయనకు ఈ చాలన్‌ను పంపించారు.

GHMC Fined Rs.5,00 to TRS MLA Muta Gopal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News