Thursday, April 25, 2024

ఎసిబి వలలో జిహెచ్‌ఎంసి అధికారి

- Advertisement -
- Advertisement -

GHMC officer

 

పంజగుట్ట: ఓ మాజీ సైనికాధికారి నుంచి లంచం తీసుకుంటున్న జిహెచ్‌ఎంసి అధికారిని శుక్రవారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. నగరంలోని జూబ్ల్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10కి చెందిన మాజీ సైనికాధికారి తన ఇంటికి సంబంధించిన మ్యూటేషన్ ప్రొసిడింగ్స్ మార్పు కోసం ఖైరతాబాద్ జోనల్ జిహెచ్‌ఎంసి టాక్స్ ఇన్‌స్పెక్టర్ జగన్‌ను కలిశాడు. పాత పద్ధతి ప్రకారమే ఆస్తి పన్ను చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తానని, ఇందుకు రూ.75 వేలు లంచం ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ జగన్ కోరాడు. దీంతో మాజీ సైనిక అధికారి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు మాజీ సైనిక అధికారి తన వద్ద విధులు నిర్వహించే డేగల రాజు ద్వారా ఖైరతాబాద్‌లో టాక్స్ ఇన్‌స్పెక్టర్ జగన్‌కు రూ. 70వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. ఎసిబి అధికారులు జగన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

GHMC officer in ACB trap
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News