అమరావతి: ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సుశీల బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె భర్త గుండా నారాయణరెడ్డి (34) నిన్న ఆత్మహత్య చేసుకోగా, సుశీల కూడా సూసైడ్ చేసుకున్నారు. వీరికి ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. పోలీసుల కథనం ప్రకారం… సోమవారం తెల్లవారుజామున భర్తతో గొడవ పడిన సుశీల తన ఆఫీస్ కు వెళ్లారు.
మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వెళ్లేసరికి భర్త ఇంట్లో సీలింగ్ కు వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గిద్దలూరు సర్కార్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాఫ్తు జరుగుతోంది. ఈ క్రమంలో సుశీల కూడా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు తీసుకున్న ఈ ఆవేశపూరిత నిర్ణయానికి పిల్లలు పిల్లలు అనాథలు అయ్యారని స్థానికులు వాపోతున్నారు.
Giddalur revenue inspector committed suicide