- Advertisement -
హైదరాబాద్: అజ్మీర్ దర్గా ఉత్సవాలకు ముస్లిం సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన గిలాఫ్ను సిఎం కెసిఆర్ శుక్రవారం పంపించారు. ప్రగతిభవన్లో గిలాఫ్కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వక్ఫ్బోర్డు ప్రతినిధులు,ముస్లిం మత పెద్దల సమక్షంలో సిఎం కెసిఆర్ గిలాఫ్కు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మహ్మద్ సలీం, శాసన మండలి సభ్యడు ఫారూఖ్ హుస్సేన్, మైనారిటీ కమిషన్ ఛైర్మన్ ఖమృద్ధీన్ ఖాద్రి, మక్కామసీదు ఇమామ్ హఫీజ్ మహ్మద్ ఉస్మాన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ఫజీయుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.
Gilaf to the Ajmer Dargah
- Advertisement -