Friday, April 19, 2024

అయ్యప్పకొండపై యువతి మృతదేహం కలకలం

- Advertisement -
- Advertisement -

Student dead in Andhra Pradesh

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కొండపై అనుమానాస్పద స్థితిలో లభ్యమైన యువతి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. గురువారం సాయంత్రం యువతి డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం ఇప్పలపల్లికి చెందిన రాంజీ కూతురు కావ్యగా గుర్తించారు. శ్రీ మల్లె బోయిన్ ఆదర్శ టిటిసిలో కావ్య సెకండ్ ఇయర్ చదువుతున్నది. కాగా, భూపాల్ అనే సమీప బంధువుపై కుటుంబికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Girl Dead body found in Mahabubnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News