- Advertisement -
మనతెలంగాణ/కొడంగల్: ట్రాక్టరు ఢీకొని బాలిక మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, తాండావాసులు తెలిపిన వివరాలు ప్రకారం…. పలుగురాళ్ళ తాండా పరిధిలోని గోప్యానాయక్ తాండాకు చెందిన రవినాయక్, తారిబాయిల దంపతుల కూతురు చిన్ని(4) ఇంటి మందు ఆడుకుంటుండగా ఇసుక లోడుతో అటుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అయితే తాండాకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా ఫిల్టర్ ఇసుకను రవాణా చేస్తున్నాడని, ఈ క్రమంలోనే ఇసుక ట్రాక్టర్ బాలికను ఢీకొట్టగా తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు తాండా వాసులు సమాచారం అందించారు. ఎస్సై ప్రభాకర్రెడ్డి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Girl dead in Tractor accident in Vikarabad district
Girl dead in Tractor accident in Vikarabad district
- Advertisement -