Tuesday, April 23, 2024

నచ్చని పెళ్లి చేసుకున్నందుకు యువతిని కత్తులతో పొడిచి..

- Advertisement -
- Advertisement -

 Girl killed by brothers for getting marriage in UP

బదౌన్: తమను ధిక్కరించి ఓ వ్యక్తిని వివాహమాడిందన్న కారణంతో 21 ఏళ్ల యువతిని సొంత సోదరులే కత్తులతో పొడిచి చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. బదౌన్ జిల్లాలోని దాతాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గురువారం వెల్లడించారు. జూన్ 28న ఇంట్లోంచి తప్పించుకుపోయిన అర్చన అనే యువతి తన దూరపు బంధువైన దేవేంద్రను పెళ్లాడారు. దేవేంద్రది రాయ్‌బరేలీ. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదుతో దేవేంద్రతోపాటు ఆయన ముగ్గురు సోదరులపై అపహరణకు పాల్పడ్డట్టు కేసు నమోదైంది.బుధవారం రాత్రి తన వాంగ్మూలాన్ని ఇవ్వడానికి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సందర్భంగా అర్చనను నలుగురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారని దేవేంద్ర ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఈ కేసులో నిందితులైన ఆమె ఇద్దరు సోదరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

 Girl killed by brothers for getting marriage in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News