Thursday, April 25, 2024

పెళ్లికి నో చెప్పిందని యువతి హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమించిన బాలిక వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని కక్షపెంచుకుని నిందితుడు ఆమె గొంతు కోసి, బిల్డింగ్‌పై నుంచి కిందపడేసి హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్‌లోని వారసిగూడలో గురువారం రాత్రి జరిగింది. వారసిగూడకు చెందిన ఫర్జానా బేగం కూతురు నజ్మ(17) (పేరుమార్చారు) స్థానిక కళాశాలలో ఇంటర్ ప్రథమ ఏడాది చదువుతోంది. ఈమె తండ్రి 2018లో మృతిచెందగా తల్లి పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో నజ్మ తనతోపాటు పాఠశాలలో చదువుకున్న యువకుడు షోయబ్(21)ను ప్రేమించింది. షోయబ్ ఫ్లెక్సీ బోర్డు డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. తన కంటే పాఠశాలలో షోయబ్ రెండేళ్లు సీనియర్ కొంత కాలం నుంచి తనను వివాహం చేసుకోవాలని బాలికను వేధిస్తున్నాడు.

ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో కక్షపెంచుకున్న షోయబ్ గురువారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లాడు. ఇద్దరు కలిసి బిల్డింగ్‌పైకి వెళ్లిన తర్వాత షోయబ్ బాలిక మెడను పట్టుకుని షాబాద్ రాయితో పొడిచాడు, తర్వాత దానితో మెడపై కొట్టాడు తర్వాత ఆమెను బిల్డింగ్‌పై నుంచి కిందపడేయడంతో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కుల్సుంపురలో….
నగరంలోని వెస్ట్‌జోన్ పరిధిలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఓ యువకుడిని బండరాళ్లతో మోది హత్య చేశారు. కుల్సుంపురకు చెందిన యువకుడు సచిన్ తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరగడంతో జియాగూడ కమెల వద్ద కార్తీక్ అనే యువకుడు బండరాళ్లతో కొట్టి సచిన్ హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పథకం ప్రకారమే కార్తీక్ హత్య చేసినట్లు ఎసిపి సురేందర్ రెడ్డి తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కుల్సుంపుర పోలీసులు తెలిపారు.

Girl Murder after refused marry in Warasiguda
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News