Friday, April 19, 2024

హర్యానాలో దారుణం: నడిరోడ్డుపై యువతిని కాల్చి చంపిన స్నేహితుడు..

- Advertisement -
- Advertisement -

హర్యానాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువతి(21)ని దారుణంగా కాల్చి చంపిన ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బికాం ఫైనల్ ఇయర్ విద్యార్థిని నిఖితా పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ యువకుడు కారులో వచ్చి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు.అయితే, బాధితురాలు ప్రతిఘటించడంతో నడిరోడ్డుపై తుపాకితో కాల్చి అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిని బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసికెమెరాలో రికార్డయ్యాయి. ఈ దారుణ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా సంఘాలు నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశాయి. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రధాన నిందితుడు తౌసీఫ్ తోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బాధితురాలి స్నేహితుడిగా భావిస్తున్నారు. ఇస్తాం మతంలోకి మారమని తౌసీఫ్ తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడని, అందుకు నిరాకరించడంతోనే తమ బిడ్డను చంపాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని బాధితురాలి తండ్రి తెలిపాడు.

Girl Shot dead outside College in Haryana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News